News January 11, 2026

కర్నూలు: నెల రోజుల క్రితం రూ.260.. నేడు రూ.300

image

కర్నూలులో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నెల క్రితం కేజీ రూ.260 ఉండగా నేడు రూ.300 పలుకుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్‌ సందర్భంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం సంక్రాంతి, కనుమ రానుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 70% తెలంగాణ నుంచి బ్రాయిలర్ కోళ్లు సరఫరా అవుతున్నాయి. 25% కర్ణాటక నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. 5% మాత్రమే జిల్లాలో కోళ్ల ఉత్పత్తి అవుతోంది.

Similar News

News March 18, 2026

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్

image

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలు బస్టాండ్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మతో కలిసి ఆమె ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి కలెక్టర్ బస్సు ప్రయాణం చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున సంక్షేమానికి సీఎం చంద్రబాబు 70 ఏళ్ల వయసులోనూ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

News March 18, 2026

ఆదోని: యువతి ఆత్మహత్య

image

ఆదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల (23) అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీమప్ప, నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె, బీ-ఫార్మసీ పూర్తి చేసి ఆదోనిలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2026

ఆదోని: యువతి ఆత్మహత్య

image

ఆదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల (23) అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీమప్ప, నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె, బీ-ఫార్మసీ పూర్తి చేసి ఆదోనిలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.