News January 11, 2026

మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యం: మంత్రి తుమ్మల

image

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రి స్వగృహంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు

Similar News

News January 25, 2026

ఖమ్మం: రేపు జాతీయ పతాకం ఆవిష్కరించనున్న కలెక్టర్

image

ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ అనుదీప్ పాల్గొంటారని జిల్లా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ. 9:30కు కలెక్టర్ ప్రసంగం. 9:50కు సాంస్కృతిక కార్యక్రమాలు. 10:45కు ప్రశంస పత్రాల పంపిణీ అనంతరం కలెక్టర్ స్టాళ్లను సందర్శిస్తారని పేర్కొన్నారు.

News January 25, 2026

కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: శ్యామల

image

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసులకు కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని, పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె. శ్యామల భరోసా ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన ఆమె, ఇటీవల పార్టీ అధినేత జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేసులు నమోదైన కార్యకర్తలను స్వయంగా పరామర్శించారు. అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం నేరమా? అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.

News January 25, 2026

ఖమ్మంలో జిల్లాలో ప్రశాంతంగా ‘జేఈఈ మెయిన్స్‌’

image

ఖమ్మంలో శనివారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు విడతల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 864 మందికి గాను 860 మంది, మధ్యాహ్నం 863 మందికి 856 మంది హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్ ఆర్ పార్వతిరెడ్డి వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.