News January 11, 2026

తిరుపతి: పండగ వస్తున్నా.. జీతమేది?

image

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చిందని ఆశపడ్డారు. తొలి నెల జీతంతో సంబరపడ్డారు. 3నెలల కాలంలో 2నెలల జీతం (నవంబర్, డిసెంబర్) విడుదల కాలేదు. సాంకేతికత కారణమైన ప్రాన్ నంబర్ ఆలస్యం కావడంతో జీతాలు రాలేదని తెలుస్తోంది. 2025 డీఎస్సీ ద్వారా సుమారు 1100 మంది టీచర్లుగా నియమితైలన వారికి పండగ వచ్చినా ఇంకా జీతాలు అందలేదు.

Similar News

News March 22, 2026

అంబేడ్కర్ వర్సిటీకి పాలక మండలి లేదా?

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పాలకమండలి లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. 2022 నవంబర్ తర్వాత పాలకమండలి సమావేశం జరగలేదు. పాలకమండలిలో 12 మంది సభ్యులు ఉంటారు, ఏడుగురు అత్యవసర సభ్యులు. కాగా ఆరు నెలలకు ఓసారి కచ్చితంగా మండలి సమావేశం జరగాలి. అయితే అలా జరగడం లేదు. దీంతో పాలన గాడి తప్పిందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, మేధావులు వ్యక్తం చేస్తున్నారు.

News March 22, 2026

సమ్మర్‌లో చికెన్ తింటున్నారా?

image

సమ్మర్‌లో మితంగా చికెన్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఇది అధిక ప్రొటీన్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమై శరీర వేడిని పెంచుతుంది. దీంతో తలనొప్పి, కళ్ల మంటలు, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చికెన్‌ను వారానికి ఒకసారి తింటే ఓకే కానీ రెండుమూడు సార్లు తీసుకుంటే బరువు పెరుగుతారు’ అని హెచ్చరిస్తున్నారు.

News March 22, 2026

విశాఖ: ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్

image

నగరంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం వేకువజాము వరకు కైలాసగిరి, సత్యం కూడలిలో గల విప్రో కంపెనీ వద్ద ఆక్టోపస్ టీం విశాఖ నగర సిటీ పోలీస్ బాంబు స్క్వాడ్‌తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. అకస్మాత్తుగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే దాని నుంచి వీఐపీలను ఎలా కాపాడాలి, ఎలా బయటపడాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వారు తెలిపారు.