News January 11, 2026
నిర్మల్: ముప్పై ఏళ్ల తర్వాత.. మురిసిన స్నేహం

నిర్మల్లోని రెడ్డి ఫంక్షన్ హాల్ గత జ్ఞాపకాల నెమరువేతకు వేదికైంది. స్థానిక శిశు మందిర్ పాఠశాలలో 1994-95 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఒకచోట చేరి సందడి చేశారు. ఆత్మీయ సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాటి మిత్రులంతా ఒకరినొకరు కలుసుకొని పాత ముచ్చట్లను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఈ సందర్భంగా సన్మానించి, ఆశీస్సులు తీసుకున్నారు.
Similar News
News March 28, 2026
ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు.. నిర్మాతల భయం!

‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్కు తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. ఒక్కో చిత్రానికి రూ.15-20 కోట్ల వరకు డిమాండ్ చేయడమే దీనికి కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు భయపడే నిర్మాతలు ముందుకు రావట్లేదని సమాచారం.
News March 28, 2026
MBNR: కొత్త పింఛన్ కోసం.. నాలుగేళ్లుగా ఎదురుచూపు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశావాహులు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అప్పటి BRS ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొత్తగా 2 లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని తాజా బడ్జెట్లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే చాలా వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. మరి ఎదురుచూపులకు తెరపడేనా..!
News March 28, 2026
ఈ లెజెండరీ IPL టీమ్పై మీ అభిప్రాయం?

IPL చరిత్రలోని బెస్ట్ ప్లేయర్స్తో కూడిన టీమ్ను స్పోర్ట్స్కీడా ఇలా సెలక్ట్ చేసింది. వార్నర్, రోహిత్ (కెప్టెన్) ఓపెనర్లుగా, కోహ్లీ, రైనా, డివిలియర్స్ మిడిల్ ఆర్డర్లో బలంగా నిలుస్తారు. ధోని కీపర్గా.. పాండ్య, జడేజా ఆల్రౌండర్లుగా రాణిస్తారు. బౌలింగ్లో సునీల్ నరైన్, బుమ్రా, మలింగ, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఈ జట్టుపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా మార్పులు చేస్తారా? Comment


