News January 11, 2026
రేపు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) జరగనుంది. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్, ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్కి తెలియజేసి, సత్వర పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.
Similar News
News February 15, 2026
మెరుగైన ర్యాంకు కోసం GVMC కసరత్తు

స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 సర్వే నేపథ్యంలో నగర ర్యాంకు మెరుగుదలపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే నెల ఢిల్లీ బృందం పరిశీలనకు రానుంది. దీంతో జీవీఎంసీ పర్యవేక్షణను పెంచి సిబ్బంది పనితీరును సమీక్షిస్తోంది. పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవగాహన కార్యక్రమాలతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, మెరుగైన ర్యాంకే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News February 15, 2026
రుషికొండ బీచ్లో బీటెక్ విద్యార్థి మృతి

రుషికొండ బీచ్లో మునిగి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విశాఖలో బీటెక్ చదువుతున్న అరవింద్( 21) తన స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా.. అరవింద్తో పాటు రాజీవ్ సముద్రంలో కొట్టుకొనిపోయారు. వెంటనే స్పందించిన లైఫ్ గార్డ్స్ వారిని ఒడ్డుకి తీసుకొచ్చారు. అప్పటికే అరవింద్ చనిపోయాడు. రాజీవ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
News February 15, 2026
సోమవారం జీవీఎంసీలో పీజీఆర్ఎస్ రద్దు: కమిషనర్

విశాఖలో ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి, IFR-2026 కార్యక్రమం ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలలో సంబంధిత అధికారిక కార్యక్రమాలలో జీవీఎంసీ అధికారులు పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాలలో నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.


