News January 11, 2026

ఆర్మేనియాలో సిరిసిల్లవాసి మృతి

image

సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మేకల ప్రవీణ్ (33) యూరప్ దేశమైన ఆర్మేనియాలో మృతి చెందాడు. బతుకుదెరువు కోసం 9 నెలల క్రితం ఆర్మేనియాకు వెళ్లిన ప్రవీణ్.. శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అతడిని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడని తాజాగా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ప్రవీణ్ కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News March 10, 2026

ఖమ్మం: ‘ప్రజాపాలన’ పనులపై సీఎస్‌ సమీక్ష

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సీఎస్‌ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.

News March 10, 2026

రణ్‌వీర్ అప్‌కమింగ్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

image

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ రణ్‌వీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రణ్‌వీర్ ఈసారి ‘ప్రళయ్’ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. ఇలాంటి సినిమాను భారత్‌లో ఎవరూ తీయలేదని.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉంటుందని డైరెక్టర్ జై మెహతా చెప్పడంతో అంచనాలు పెరిగాయి. రణ్‌వీర్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

News March 10, 2026

బాపట్ల ‘పుర’ అధికారులు నియామకం

image

రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర కార్యదర్శి సురేశ్ కుమార్ జీఓ విడుదల చేశారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె, చీరాల పురపాలక సంఘ అధికారులకు గ్రేడ్-2 అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. రేపల్లెకు రేపల్లె ఆర్డీఓ, చీరాల పురపాలక సంఘానికి చీరాల ఆర్డీఓ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.