News January 11, 2026
నారాయణపురం: 57 ఏళ్లు.. 18 పట్టాలు

మండలానికి చెందిన ఇమ్మడి నాగేష్ అక్షరాలతోనే సహవాసం చేస్తూ అనేక కోర్సుల్లో 18 పట్టాలు సాధించారు. సొంత ఊర్లో ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన నాగేష్ ఇటీవల 57 ఏళ్ల వయసులో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి యోగాలో డిప్లొమా కోర్సు చేసి పట్టా స్వీకరించారు. తన ఊరిలో ‘గ్రామ శ్రీ’ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య శిబిరాలతో పాటు విద్యార్థులకు తీర్థ వికాస శిక్షణాసేవా వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News March 23, 2026
ఖరీఫ్కు కష్టమే.. తగ్గిన యూరియా తయారీ!

హార్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్కు రావాల్సిన LNG సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి 50% పైగా పడిపోయింది. గ్యాస్ కొరత వల్ల గెయిల్, IOC వంటి సంస్థలు యూరియా ప్లాంట్లకు సప్లై తగ్గించాయి. ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్కు అవసరమైన 170-180 లక్షల టన్నుల యూరియా లభ్యతపై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం దేశంలో కేవలం 62 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గాయి.
News March 23, 2026
రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి.. నేడు ఆర్సెలార్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్కు CM CBN ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి Dy.CM పవన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 1.25L మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి 2033కు పనులు పూర్తిచేయాలనేది లక్ష్యం.
News March 23, 2026
హార్ముజ్లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.


