News January 11, 2026

మంచిర్యాల: మేడారం వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్

image

సమ్మక్క సారాలమ్మ దర్శనానికి మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. సింగరేణి కార్మికుడు కుచలరెడ్డి, భార్య, కూతురుతో కలిసి మేడారం జాతరకు వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని శ్రీరాంపూర్‌కు తిరిగి వస్తుండగా జైపూర్ మండలం శెట్టిపల్లి వద్ద ప్రమాదవశాత్తు కారు, చెట్టును ఢీకొంది. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.

Similar News

News February 15, 2026

హస్తం జోరు.. ఇక GHMC ఎన్నికలేనా?

image

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తాచాటడంతో జోష్‌లో ఉంది. ఇదే ఊపులో GHMC ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటంతో పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. మే నెల చివరి కల్లా పాలకమండలి కొలువుదీరేలాగా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో హస్తానికి మిశ్రమ ఫలితాలొచ్చాయి.

News February 15, 2026

టోల్ వసూలు రూల్స్‌లో మార్పులు.. నేటి నుంచే!

image

నేషనల్ ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ వసూలు రూల్స్‌లో కేంద్రం మార్పులు చేసింది. ఇకపై పూర్తిగా అందుబాటులోకి రాని ఎక్స్‌ప్రెస్ వేల్లో మొత్తం టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. పనులు పూర్తయిన మేరకే ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది నేటి నుంచే అమల్లోకి రానుంది. దీంతో కొంత భాగమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ భారం తగ్గనుంది. ప్రస్తుతం నేషనల్ హైవేలతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై 25% ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

News February 15, 2026

తూ.గో: ఉదయాన్నే ప్రమాదం.. ఇద్దరి మృతి

image

దేవరపల్లి శివారులో కొత్తగూడెం ఫ్లై ఓవర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న బొలెరో వాహనం, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దూమంతనగూడేనికి చెందిన పురుషుడు, మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బొలెరో డ్రైవర్‌తో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు తెలియాల్సి ఉంది.