News January 11, 2026
దేశంపై నమ్మకం ఉంచండి: పీయూష్ గోయల్

భారత్తో ట్రేడ్ డీల్ ఆలస్యం కావడానికి మోదీ ఫోన్ <<18809902>>చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. దేశంపై నమ్మకం ఉంచాలని ప్రజలను కోరారు. ‘మీ దేశాన్ని, మాతృభూమిని విశ్వసించండి. విదేశీయుల ప్రకటనలను కాదు. ట్రేడ్ డీల్ చిక్కుల గురించి మీడియా ముందు మాట్లాడుకోరు. రహస్యంగానే చర్చిస్తారు’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 24, 2026
పశ్చిమాసియా సంక్షోభం.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు హౌస్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎరువుల మంత్రి నడ్డా హాజరయ్యారు. మరోవైపు ఇదే అంశంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్రం <<19464829>>పిలుపునిచ్చిన<<>> విషయం తెలిసిందే.
News March 24, 2026
రాజస్థాన్ రాయల్స్ విక్రయం!

IPL ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ను అమెరికా వ్యాపారవేత్త కల్ సొమానీ కొనుగోలు చేశారు. మెజారిటీ వాటాదారు ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ నుంచి రూ.15,300 కోట్ల($1.63B)కు ఆయన ఆధ్వర్యంలోని కన్సార్షియం సొంతం చేసుకున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ IPL సీజన్ నుంచే ఇది అమల్లోకి రావచ్చని చెప్పింది. టోర్నీ చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ డీల్ అని తెలుస్తోంది. మనోజ్ బదాలే(ఎమర్జింగ్ మీడియా వెంచర్స్)కు RRలో 65% వాటా ఉంది.
News March 24, 2026
TDP ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు అన్యాయం: బొలిశెట్టి

AP: TDP MLAలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు న్యాయం జరగడం లేదని ఆ పార్టీ MLA బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ‘మా MLAలు ఉన్న చోట TDPకి ప్రాధాన్యమిస్తున్నాం. మాకూ అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నాం. CBN, లోకేశ్ సహకరిస్తున్నా కింది స్థాయిలో అలా లేదు. త్వరలో సమన్వయ సమావేశంలో చర్చిస్తాం. పార్టీలో ఉన్న అసంతృప్తిపై JSPLP భేటీలో పవన్ దృష్టికి తీసుకెళ్లాం’ అని వెల్లడించారు.


