News April 25, 2024
ఏపీలో భారీగా దాఖలైన నామినేషన్లు

ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు నిన్న భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కరోజే ఎంపీ స్థానాలకు 203 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 1,123 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఎంపీ స్థానాలకు 555 మంది, ఎమ్మెల్యే స్థానాలకు 3,084 మంది నామినేషన్ వేసినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.
Similar News
News February 2, 2026
నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

AP: రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి YCP మహాపరాధం చేసిందని Dy.CM పవన్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, అయినా YCP విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పార్టీ మీటింగ్లో నేతలకు సూచించారు.
News February 2, 2026
ఈ FEB అరుదైన నెల అంటూ ప్రచారం.. నిజమెంత?

2026 ఫిబ్రవరి 823 ఏళ్లకోసారి వచ్చే అరుదైన నెల అంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ప్రతి వారం సరిగ్గా 4 సార్లు రావడమే ఇందుకు కారణం. అయితే ఈ ప్రచారం అవాస్తవం. నిజానికి లీప్ ఇయర్ కాని ప్రతి ఏటా FEBలో 28 రోజులే ఉంటాయి. అంటే ప్రతి వారం కచ్చితంగా 4 సార్లే వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆదివారంతో మొదలవడంతో క్యాలెండర్లో తేదీలు క్రమ పద్ధతిలో కనిపిస్తున్నాయి. గతంలో 2015లో ఇలాగే జరగగా, 2037లోనూ రానుంది.
News February 2, 2026
ఎయిరిండియా విమానంలో ‘ఫ్యూయల్ స్విచ్’ సమస్య!

లండన్-బెంగళూరు ఎయిరిండియా విమానంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లో లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ బోయింగ్ 787-8 విమానాన్ని గ్రౌండ్ చేశారు. విమాన తయారీ సంస్థ (OEM)తో చెకింగ్ చేయిస్తున్నారు. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA దృష్టికీ తీసుకెళ్లారు. గత ఏడాది 260 మంది మృతికి కారణమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఫ్యూయల్ స్విచ్ సమస్యల వల్లే జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


