News January 12, 2026
అనకాపల్లి: బొలెరో వాహనం బీభత్సం

పాయకరావుపేట మండలం నామవరం వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 గొర్రెలు మృతి చెందగా, మరో 20 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. నామవరం నుంచి గొర్రెల కాపరులు పాయకరావుపేట వైపు మందను తోలుతుండగా వెనకనుంచి బొలెరో వాహనం ఢీకొట్టి ఆగకుండా పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 17, 2026
VZM: ‘గనుల లీజుకు త్వరగా అనుమతులు’

నిబంధనలను పరిశీలించిన అనంతరం గనుల లీజుకు వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేస్తామని JC సేధు మాధవన్ చెప్పారు. సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆద్వర్యంలో వీసీ నిర్వహించారు. గరివిడి మండలం మందిరవలస, చీపురుపల్లి మండలం నిమ్మలవలస, నెల్లిమర్ల మండలం జగ్గిరాజుపేట గనుల కోసం వివరించి NOC మంజూరు చేస్తామని తెలిపారు.
News February 17, 2026
మైక్రో ఇరిగేషన్ పథకంపై మరింత అవగాహన అవసరం: కలెక్టర్

ఏలూరు జిలాల్లో మైక్రో ఇరిగేషన్ పథకంపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం మాట్లాడుతూ.. డ్రిప్, స్ప్రింక్లర్లు 8,500 హెక్టార్లలో ఏర్పాటు చేయాలని నిర్దేశించగా ఇప్పటి వరకు 6,268 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు కావడంపై అధికారులపై మండిపడ్డారు. అటు రైతులంతా డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 17, 2026
VZM: విశాఖలో సాగర సంగ్రామానికి APNGO మద్దతు

ఈనెల 22న ఆదివారం విశాఖపట్నంలో జరగనున్న “సాగర సంగ్రామం” కార్యక్రమానికి APNGO’ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విజయనగరం ఎన్జీవో హోమ్ భవనంలో జిల్లా అధ్యక్షుడు సురేశ్, కార్యదర్శి శ్రీధర్ చేతుల మీదుగా మంగళవారం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. సంక్రాంతికి విడుదల చేసిన పెండింగ్ DA ఏరియర్స్ వెంటనే క్రెడిట్ చేయాలని, మెమో 57 అమలు చేయాలని, మెమో 178 ప్రకారం మరణించిన ఉద్యోగుల నామినీలకు 50% చెల్లించాలన్నారు.


