News January 13, 2026
నేటి నుంచి పరేడ్ గ్రౌండ్స్లో పతంగుల పండుగ

TG: Hyd పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నుంచి 18వ తేదీ వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అలాగే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. పతంగులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. భద్రత దృష్ట్యా మాంజా దారాన్ని నిషేధించారు. సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.
Similar News
News February 20, 2026
తండ్రి హెల్త్ అప్డేట్స్ బయటకు రావడంపై సల్మాన్ అసంతృప్తి

సల్మాన్ ఖాన్ తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ ఆరోగ్య <<19171270>>పరిస్థితి<<>> విషమంగానే ఉంది. 90 ఏళ్ల ఆయనకు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది. అయితే సలీమ్ హెల్త్ అప్డేట్స్ బయటికి రావడంపై ఆసుపత్రి వర్గాలపై సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన కుటుంబీకులతో కలిసి హాస్పిటల్కు వెళ్లారు. తన తండ్రి హెల్త్ అప్డేట్స్ ఏవీ బయటికి చెప్పొద్దని, ప్రైవసీ మెయింటెన్ చేయాలని సూచించారు.
News February 20, 2026
ఇతరుల చేతి నుంచి తీసుకోకూడని వస్తువులు ఇవే..

నూనె, ఉప్పు, గుడ్లు.. ఇతరులు ఇస్తున్నప్పుడు వీటిని నేరుగా చేతితో తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తికి ఓ ప్రత్యేక శక్తి ఉంటుంది. వస్తు మార్పిడితో ఆ శక్తి బదిలీ అయ్యే అవకాశాలుంటాయి. అలా.. వీటిని తీసుకుంటే వారి నెగటివ్ ఎనర్జీ కూడా రావొచ్చు. తద్వారా వారి కష్టాలు, దోషాలు సైతం అంటుతాయని నమ్మకం. వీటిని కింద పెట్టమని చెప్పి ఆ తర్వాత తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు.
News February 20, 2026
భారత పర్యటనకు షకీరా

గ్లోబల్ పాప్ ఐకాన్, గ్రామీ అవార్డ్ విన్నర్ షకీరా ఇండియా పర్యటనకు రానున్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘ఫీడింగ్ ఇండియా’ నిర్వహించే కాన్సర్ట్లలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఏప్రిల్ 10, 15 తేదీల్లో ముంబై, ఢిల్లీలో ఈవెంట్స్ జరగనున్నాయి. దీనిద్వారా వచ్చే డబ్బులను పోషకాహార లోపంతో బాధపడే పిల్లల కోసం వెచ్చించనున్నారు. షకీరా చివరిసారిగా 2007లో ముంబైకి వచ్చారు.


