News January 13, 2026
నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’: కామారెడ్డి ఎస్పీ

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ప్రారంభమయ్యే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో విజయవంతం చేయాలని SP రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూనే, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రత, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
Similar News
News March 19, 2026
ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.
News March 19, 2026
ఈరోజు నమాజ్ వేళలు (17-3-2026) మంగళవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:23 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 19, 2026
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఖరారు

ఖమ్మం DCC నూతన కార్యవర్గాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కసరత్తు చేసిన పీసీసీ.. జిల్లాలోని కీలక నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన కమిటీని వెల్లడించింది. ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 22 మంది ప్రధాన కార్యదర్శులు, 26 మంది కార్యదర్శులకు చోటు కల్పించారు. వీరితో పాటు 5 మంది అధికార ప్రతినిధులు, 15 మంది కార్యనిర్వాహక సభ్యులను నియమించారు.


