News January 13, 2026

కామారెడ్డి: మత్తులో నడిపితే.. జైలులో పడాల్సిందే!

image

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 33 మందికి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నలుగురికి రెండు రోజులు, పది మందికి ఒక రోజు జైలు శిక్ష విధించారు. మిగిలిన వారితో కలిపి మొత్తం రూ.38,500 జరిమానా విధించినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది. ప్రజల భద్రత కోసం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని SP స్పష్టం చేశారు.

Similar News

News March 8, 2026

ఖమ్మం: ఈ మహిళా సర్పంచ్ గ్రేట్ కదా..!

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ నాయకన్ గూడెం సర్పంచ్ కంచరి సైదమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భర్త ఆటో నడుపుతూ, టైర్ల షాపు నిర్వహిస్తుండగా.. ఆమె ఖాళీ సమయాల్లో ఆయనకు చేదోడుగా ఉంటూ పంచర్లు వేసేవారు. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కూడా ఆమె తన పనిని వదలకుండా, ఒకపక్క గ్రామ అభివృద్ధి పనులు చూస్తూనే.. మరోపక్క కష్టాన్ని నమ్ముకుని శ్రమిస్తున్నారు. ఆమె అంకితభావం మహిళలకు స్ఫూర్తినిస్తోంది.

News March 8, 2026

పాలమూరు: అంతుచిక్కని వ్యాధితో వేల సంఖ్యలో కోళ్ల మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని చెన్నపురావుపల్లిలో కొన్ని రోజులుగా అంతుచిక్కని వ్యాధి ప్రబలడంతో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. పౌల్ట్రీ రంగానికి భారీ నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో తీరని ఆర్థిక నష్టం వాటిల్లిందని, చనిపోయిన కోళ్లను గుంతలు తీసి పాతిపెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 8, 2026

తిరుపతి: మహిళా రైల్వే స్టేషన్ గురించి తెలుసా…!

image

అవును ఇది దక్షిణ భారతదేశంలోనే ఏకైకా మహిళా రైల్వే స్టేషన్ గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చంద్రగిరి రైల్వే స్టేషన్. స్టేషన్ మాస్టర్ నుంచి ఆర్పీఎఫ్ సిబ్బంది, గార్డులు ఇలా అన్ని విభాగాల్లో రాత్రి, పగలు మహిళలే విధులు నిర్వహిస్తుంటారు. 2018 నుంచి ఇప్పటివరకు మహిళలే నడిపిస్తున్న మహిళా రైల్వే స్టేషన్‌గా కీర్తి గడించింది.