News January 13, 2026
నంద్యాల: నడివీధిలో చెప్పుతో కొట్టాడు.. న్యాయం చేయండి సార్..!

శిరివెళ్ల మండలం వణికందిన్నెకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ నంద్యాల జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. తనను మహిళ అని కూడా చూడకుండా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నడివీధిలో చెప్పుతో కొట్టి అవమానపరిచాడని ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వ్యక్తి నుంచి తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు.
Similar News
News March 15, 2026
‘ఉస్తాద్’ అందుకే లేట్ అయింది: హరీశ్ శంకర్

కథ మారినందుకే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఆలస్యమైందని ప్రీరిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ హరీశ్ శంకర్ తెలిపారు. తొలుత అనుకున్న స్టోరీ సెట్ కాకపోవడంతో స్క్రిప్ట్ మార్చడం, కరోనా వంటి కారణాలతో లేట్ అయిందన్నారు. ఈ జర్నీలో ప్రొడ్యూసర్స్, పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇక మూవీ ఆలస్యంపై కొందరు కథలుకథలుగా మాట్లాడుకున్నారని, అది సృష్టి ధర్మమని హరీశ్ సెటైర్ వేశారు. ఈ సారి పండుగ ఉస్తాద్ ఉగాది అన్నారు.
News March 15, 2026
అమలాపురం: బాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్లో దంపతుల విజయం

అమలాపురం బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ టోర్నమెంట్లో రాజమండ్రికి చెందిన దంపతులు తమ అద్భుత ప్రతిభతో విజేతలుగా నిలిచారు. రాజీ, విజయ్ జంట క్రీడా మైదానంలో ఒకరికొకరు చక్కని సమన్వయంతో ఆడి ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే జట్టుగా ఆడి విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడం అక్కడి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
News March 15, 2026
టెన్త్ పరీక్షలకు పోలీసు బందోబస్తు సిద్ధం: ఎస్పీ

సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం కోనసీమ జిల్లాలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ భరోసా ఇచ్చారు.


