News January 13, 2026
పిల్లలకు భోగి పళ్లు పోస్తున్నారా?

ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రదోష వేళలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టి భోగి పళ్లు పోయాలని పండితులు సూచిస్తున్నారు. తల్లి మొదట భోగి పళ్లతో బిడ్డకు 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా దిష్టి తీసి ఆపై తల మీద నుంచి పోయాలి. ఇలా చేస్తే నరదోషం తొలగిపోతుందని, నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. చివరగా పిల్లలకు హారతివ్వాలి. భోగి పళ్లలో ఏమేం ఉండాలి? ఎందుకు పోయాలి? భోగి మంటల ఆవశ్యకత కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
Similar News
News February 23, 2026
TGPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

TG: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్డేట్ చేసుకునే గడువును మార్చి 25కు పొడిగిస్తున్నట్లు TGPSC ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని తెలిపింది. అధికారిక వెబ్సైట్ <
News February 23, 2026
ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి నాలుగేళ్లు

ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి రేపటితో నాలుగేళ్లు పూర్తికానున్నాయి. 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దాడులకు ఆదేశించారు. ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది. ఇప్పటివరకు ఉక్రెయిన్లో 14,999 మంది పౌరులు మరణించినట్లు UN తెలిపింది. 59లక్షల మంది పౌరులు విదేశాలకు వలస వెళ్లిపోయారు. 1.40లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు, 3.25లక్షల మంది రష్యా జవాన్లు చనిపోయినట్లు సమాచారం.
News February 23, 2026
ఆలస్యంగా నిద్రపోతే..

ఆరోగ్యంగా ఉండేందుకు డైట్, వ్యాయామంతోపాటు నిద్ర కూడా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే టైమ్లో నిద్రపోని, 11PM వరకు మేల్కొనే వారు బరువు తగ్గడంలో ఇబ్బంది పడతారని చెబుతున్నారు. ‘10.30PM తర్వాత జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ సమయంలో మేల్కొంటే శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితమవుతాయి. ఇది బరువుపై ప్రభావం చూపుతుంది. అజీర్ణం, ఉబ్బరం సమస్యలొస్తాయి’ అని హెచ్చరిస్తున్నారు.


