News April 25, 2024

లక్షా 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తా: పెమ్మసాని చంద్రశేఖర్

image

గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంటూరు ఎంపీగా తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్షా 50 వేల ఓట్ల పైనే మెజార్టీ వస్తుందన్నారు. తాను కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. అలాంటి తనతో జగన్‌ను పోల్చడం సరికాదన్నారు. కష్టపడి పైకొచ్చిన ఎవరితో అయినా జగన్‌ను పోల్చి చూడటం అవమానకరమని పెమ్మసాని వివరించారు.

Similar News

News April 21, 2025

నేడు గుంటూరులో చెక్కుల పంపిణీ

image

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణలో భాగంగా భూ సేకరణకు అంగీకరించిన యజమానులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై యజమానులకు నష్టపరిహారం చెక్కులను అందజేస్తారు. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

News April 20, 2025

కొల్లిపర: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

కొల్లిపర మండలం గుడిబండి వారిపాలెంకి చెందిన గుంటూరు రత్న కుమారి (22) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కొల్లిపరలోని గవర్నమెంట్ హాస్పటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్ సుప్రియ నిర్ధారించారు. తెనాలి సీఐ ఆర్.ఉమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2025

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : DEO

image

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.

error: Content is protected !!