News January 13, 2026
జిల్లాల పునర్విభజన ఇప్పుడు సాధ్యం కాదా?

TG: జిల్లాల పునర్విభజన చేపడతామన్న ప్రభుత్వ నిర్ణయానికి దేశవ్యాప్త జనగణన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. 2027 MAR 1 నుంచి జరిగే ఈ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు ఇప్పట్లో మార్చొద్దని గతంలో కేంద్రం సూచించింది. దీనివల్ల జనగణనలో ఇబ్బందులు ఏర్పడి, జిల్లాలవారీ లెక్కలు తీయడం సాధ్యం కాదని చెప్పింది. మరి పునర్విభజనకు ప్రభుత్వం రెండేళ్లు ఆగుతుందా? లేదంటే ఎలా ముందుకెళ్తుంది? అనేది ఆసక్తికరం.
Similar News
News February 17, 2026
రైళ్ల టాయిలెట్ల శుభ్రతకు ఏఐ టెక్నాలజీ

రైళ్లలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా టాయిలెట్లు ఉంటాయి. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రిజర్వ్, జనరల్ బోగీల్లోనూ గంటకోసారి శుభ్రం చేసేలా AIని వాడుతోంది. తొలిదశలో 100 రైళ్లలో ప్రారంభించినట్లు చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ లక్ష్మణ్ తెలిపారు. ‘క్లీనింగ్కు ముందు, తర్వాత ఫొటోలను మొబైల్ యాప్లో సిబ్బంది అప్లోడ్ చేయాలి. వాటిలో ఏ మాత్రం తేడా ఉన్నా AI అప్రమత్తం చేస్తుంది’ అని చెప్పారు.
News February 16, 2026
ప్రపంచానికే పరిష్కారాలు చూపుతాం: మోదీ

ఢిల్లీ కేంద్రంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆవిష్కర్తలు, పరిశోధకులు, ఔత్సాహికుల మధ్య ఉండటంవల్ల భారతీయ ప్రతిభ, ఏఐ సామర్థ్యం గురించి అవగాహన కలుగుతోంది. అందరం కలిసి మన దేశానికే కాకుండా అనేక సమస్యలపై ప్రపంచానికే పరిష్కారాలను చూపుతాం’ అని రాసుకొచ్చారు.
News February 16, 2026
రోకో.. స్టైల్ అదుర్స్

టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వయసు పెరుగుతున్నా యంగ్గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ 38, 37 ఏళ్ల స్టార్ ప్లేయర్ల లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రోహిత్ శర్మ బరువు తగ్గి, ఫిట్గా, స్టైలిష్గా మారిపోయారు. అటు ఇండియాకు వచ్చిన విరాట్ తనదైన స్వాగ్తో అదుర్స్ అనిపించారు.


