News April 25, 2024
కంట్రోల్ రూంను సందర్శించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు

గజపతినగరం,నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా గురువారం ఎన్నికల కంట్రోల్ రూంను, మీడియా కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన వాహనాల జీపీఎస్, చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల లైవ్ కార్యక్రమాలను, మీడియా మానిటరింగ్, ఎంసీసీ, సీ-విజిల్, 24/7 ఫిర్యాదుల విభాగం, సోషల్ మీడియా పర్యవేక్షణ, రిపోర్ట్స్ విభాగాలను తనిఖీ చేశారు.
Similar News
News April 21, 2025
విజయనగరం: కేటగిరీల వారీగా పోస్టులు వివరాలు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో డీఎస్సీ ద్వారా 446 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. కేటగిరిలా వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.➤ OC-184 ➤ BC-A:33 ➤ BC-B:43➤ BC-C:3 ➤ BC-D:31 ➤ BC-E:16➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:29➤ SC-గ్రేడ్3:31 ➤ ST:26 ➤ EWS:40 NOTE సజ్జెక్టుల వారీగా వివరాల కోసం ఇక్కడ <<16156073>>కిక్ల్<<>> చేయండి.
News April 21, 2025
రాజాం: జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు

మండలంలోని ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తరి నాగరాజు రాజాంలోని ఆర్కే కాంప్లెక్స్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్డులు ఇస్తున్నారని వెళ్లారు. జనసేన నాయకుడు పొగిరి సురేశ్ బాబు తనను ఇక్కడికెందుకు వచ్చావని కులం పేరుతో తిట్టి, అతని అనుచరులతో దాడి చేయించాడని రాజాం పోలీసు స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ రవి కుమార్ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 21, 2025
VZM: ఈ నెల 22న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల పర్యటన

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 22వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3-00 గంటలకు శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకొని, 3.30 గంటలకు నెల్లిమర్ల మండలంలోని తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు చేరుకొని పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 4.00 నుంచి 5.30 గంటల వరకు ప్రాజెక్ట్ పనులు, పునరావాసం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.