News January 13, 2026
ఉపాధి పనుల్లో గోల్మాల్.. ఏకంగా రూ.21 కోట్లు

పిఠాపురం మండలంలో ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు జరిగినట్లు మంగళవారం నిర్వహించిన సోషల్ ఆడిట్లో వెల్లడైంది. 2024-25 ఏడాదికి సంబంధించి రూ.21.45 కోట్ల చెల్లింపుల్లో సంతకాలు, వేలిముద్రలు లేకుండానే నిధులు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. కూలీల వేతనాలు, మెటీరియల్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆడిట్ బృందం పేర్కొంది. క్షేత్రస్థాయిలో జరిగిన ఈ లోపాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
Similar News
News January 31, 2026
ASF: రాబందుల మకాం మార్పు.. మహారాష్ట్ర వైపు చూపు!

అరుదైన ఇండియన్ వల్చర్స్(రాబందులు) MHకు వలస వెళ్లాయి. ASF జిల్లా పెంచికల్పేటలోని పాలరాపు గుట్టల వద్ద అటవీ అధికారులు చేపట్టిన సంరక్షణ చర్యల వల్ల వీటి సంఖ్య పెరిగింది. అయినప్పటికీ అదనపు ఆహారం కోసం గడ్చిరోలి(D) కమలాపూర్ పక్షుల కేంద్రానికి తరలిపోయాయి. గతంలో ‘డిక్లోఫెనాక్’ ప్రభావంతో అంతరించిపోయే దశకు చేరిన ఈ పక్షులు, ప్రస్తుతం పాలరాపు గుట్టల్లో ఒకే జత మిగలడం పట్ల పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
News January 31, 2026
MBNR: నేడు స్కూటీని.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో శనివారం అధికారులు పత్రాల పరిశీలన చేపట్టారు. అసంపూర్తి సమాచారం, సాంకేతిక లోపాలు ఉంటే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కాగా పాలమూరు కార్పొరేషన్కు 579, దేవరకద్ర 86, భూత్పూర్ 96 నామినేషన్లు రాగా, WNP జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు 812, NRPT 541, GDL 525, NGKL 521 నామినేషన్లు దాఖలయ్యాయి.
News January 31, 2026
ఇంద్రవెల్లి: దంపతుల గొడవ.. గొంతుకొసుకున్నాడు

ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ పుకెట్ నగర్కు చెందిన రామదాస్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతుల మధ్య తలెత్తిన గొడవలతో మనస్తాపం చెందిన ఆయన ఆవేశంలో గొంతు కోసుకున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం రామదాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.


