News January 13, 2026
BREAKING: యాదాద్రి: అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు

భూరిజిస్ట్రేషన్ల ఛార్జీల చెల్లింపుల్లో అక్రమాలపై యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, వలిగొండ PSలలో తహశీల్దార్లు ఈరోజు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ల ఫిర్యాదు మేరకు 4 PSలల్లో ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు 19 మందిపై కేసులు నమోదు చేశారు. వలిగొండ రూ.15 లక్షలు యాదగిరిగుట్ట రూ.72 లక్షలు, బొమ్మలరామారంలో రూ.25 లక్షలు, తుర్కపల్లిలో రూ.14 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు.
Similar News
News February 2, 2026
జోగి రమేశ్పై కేసు నమోదు

AP: మాజీ మంత్రి జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై తీవ్ర <<19023498>>వ్యాఖ్యలు<<>> చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జోగి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. కాగా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జోగి రమేశ్ ఇంటికి నిప్పు అంటించిన ఘటనలోనూ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
News February 2, 2026
ఎరువుల ధరలు పెరిగే అవకాశం!

ఎరువుల తయారీలో కీలక ముడిపదార్థాలైన అమ్మోనియం ఫాస్పేట్, అమ్మోనియం నైట్రో ఫాస్పేట్, పొటాషియం సల్ఫేట్ లాంటి ఉత్పత్తులపై కేంద్రం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మినహాయింపులను రద్దు చేసింది. దీని వల్ల DAP, NPK వంటి కాంప్లెక్స్ ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. ఫాస్పేట్, పొటాష్ ఆధారిత ఎరువుల ముడి సరుకులను మనం ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ తరుణంలో ఎరువుల ధరలు కూడా పెరిగే ఛాన్సుంది.
News February 2, 2026
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణలో 5% వృద్ధి

TG: ఈ ఏడాది జనవరిలో GST వసూళ్లలో 5% వృద్ధి నమోదైంది. 2025 జనవరిలో రూ.4,068 కోట్లు రాగా ఈ సారి రూ.4,261 కోట్ల పన్నులు వసూలయ్యాయి. మరోవైపు 2025లో 4 శ్లాబుల జీఎస్టీ రేట్లను రెండుకు తగ్గించడంతో కలెక్షన్లు మందకొడిగా ఉన్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పన్ను వసూళ్లలో ఉన్న లోపాలను సరిదిద్ది జీఎస్టీ వసూళ్లను పెంచే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.


