News January 14, 2026
ఇరాన్ ఘర్షణలు రక్తసిక్తం.. 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు జరుపుతున్న కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 2,571కి చేరినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తెలిపింది. వీరిలో 147 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు వెల్లడించింది. మరో 18,100 మంది అరెస్టైనట్లు పేర్కొంది. ఉద్రిక్తతలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
Similar News
News February 21, 2026
AIIMS బీబీనగర్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని <
News February 21, 2026
ఉగ్రదాడికి ప్లాన్.. ఢిల్లీలో హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎర్రకోట సమీపంలోని ఆలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడొచ్చని ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో రెడ్ ఫోర్ట్ సహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. గతేడాది ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.
News February 21, 2026
క్రిస్ క్యాపిటల్ చేతికి నోవార్టిస్

స్విస్ హెల్త్కేర్ దిగ్గజం ‘నోవార్టిస్ ఏజీ’ భారత్లో వ్యాపారానికి ఫుల్స్టాప్ పెట్టనుంది. నోవార్టిస్ ఇండియా లిమిటెడ్లో ఉన్న 70.68% వాటాను క్రిస్ క్యాపిటల్కు విక్రయించనుంది. దీని విలువ రూ.1,446 కోట్లు కాగా ఈ ఏడాది చివరి నాటికి డీల్ పూర్తి కానుంది. దీంతో నోవార్టిస్లోని 26% వాటా కొనుగోలుకు క్రిస్ క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. అందుకు షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లు వెచ్చిస్తోంది.


