News January 14, 2026

ఇరాన్‌ ఘర్షణలు రక్తసిక్తం.. 2,571 మంది మృతి!

image

ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు జరుపుతున్న కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 2,571కి చేరినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తెలిపింది. వీరిలో 147 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు వెల్లడించింది. మరో 18,100 మంది అరెస్టైనట్లు పేర్కొంది. ఉద్రిక్తతలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Similar News

News February 21, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని <>AIIMS<<>> బీబీనగర్‌లో 13జూనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. MBBS అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1180, SC,ST,PwBD, మహిళలకు ఫీజు లేదు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in

News February 21, 2026

ఉగ్రదాడికి ప్లాన్.. ఢిల్లీలో హైఅలర్ట్

image

దేశ రాజధాని ఢిల్లీలో పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎర్రకోట సమీపంలోని ఆలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడొచ్చని ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో రెడ్ ఫోర్ట్ సహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. గతేడాది ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.

News February 21, 2026

క్రిస్ క్యాపిటల్ చేతికి నోవార్టిస్

image

స్విస్ హెల్త్‌కేర్ దిగ్గజం ‘నోవార్టిస్ ఏజీ’ భారత్‌లో వ్యాపారానికి ఫుల్‌స్టాప్ పెట్టనుంది. నోవార్టిస్ ఇండియా లిమిటెడ్‌లో ఉన్న 70.68% వాటాను క్రిస్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. దీని విలువ రూ.1,446 కోట్లు కాగా ఈ ఏడాది చివరి నాటికి డీల్ పూర్తి కానుంది. దీంతో నోవార్టిస్‌లోని 26% వాటా కొనుగోలుకు క్రిస్ క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. అందుకు షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లు వెచ్చిస్తోంది.