News January 14, 2026

ఊగిసలాటలో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎర్లీ ట్రేడింగ్‌లో ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు కుంగి 83,599 వద్ద.. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 25,716 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో NTPC, టాటా స్టీల్, BEL, ట్రెంట్, M&M షేర్లు లాభాల్లో.. ఏషియన్ పెయింట్స్, TCS, బజాజ్ ఫిన్‌సర్వ్, HCL టెక్, ఇండిగో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News February 10, 2026

విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

image

AP: విశాఖ మెట్రోకు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. CM చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రోకి అనుమతి ఇవ్వాలనే CM అభ్యర్థన మేరకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత మెట్రోకి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడే అవకాశముంది.

News February 10, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

హైదరాబాద్‌లోని AIIMS బీబీనగర్ 26 Jr. రెసిడెంట్, Sr. రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG, సంబంధిత విభాగంలో MD, DNB, DM, MS, MCh అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ రెసిడెంట్ పోస్టులను అకడమిక్ మెరిట్ ఆధారంగా, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in

News February 10, 2026

కృతజ్ఞత లేని వారికి మళ్లీ సాయం చేయొద్దు: పరుచూరి

image

ఇతరులు చేసిన మంచిని, సాయాన్ని ఇట్టే మర్చిపోయే రోజులివి. అలాంటి వారిని ఉద్దేశించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. మంచితనంతో చేసిన సాయాన్ని మర్చిపోయే వారికి మరోసారి మేలు చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇది అర్హత లేని వారికి దానం చేయడం కిందకే వస్తుందని రాసుకొచ్చారు. కృతజ్ఞత లేని వారికి పొరపాటున కూడా మళ్లీ సాయం చేసి తప్పు చేయవద్దని ఆయన సూచించారు.