News January 14, 2026

ప్రధాని మెచ్చిన కాకినాడ యువకుడి ఐడియా

image

కాకినాడ జిల్లా కేఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన యువకుడు కొరుప్రోలు శివ మణికంఠ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. ఈనెల 12న ఢిల్లీలో జరిగిన ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2026’లో ఆయన పాల్గొని, వ్యవసాయ రంగంలో తనకున్న వినూత్న ఆలోచనలను ప్రధాని మోదీ సమక్షంలో ప్రదర్శించారు. శివ మణికంఠ టాప్-5 ఐడియా విభాగంలో నిలవడం విశేషం. ఈ యువకుడి ఘనతపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News February 18, 2026

డిన్నర్ ఎప్పుడు చేస్తున్నారు?

image

నిద్ర పోయే 3 గంటల ముందే భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు 3.5%, హార్ట్ బీట్ 5% తగ్గుతాయని చెబుతున్నారు. ‘ఆలస్యంగా తినడం వల్ల శరీరం జీర్ణక్రియలోనే నిమగ్నమైపోతుంది. ‘మెదడు క్లీనింగ్’ ప్రాసెస్‌కూ ఆటంకం ఏర్పడుతుంది. ఆహారం మార్చకుండా, కేవలం సమయం మార్చడం ద్వారా మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇలా చేయండి’ అని తెలిపారు. share it

News February 18, 2026

తిరుపతి: ఫీజు కడితేనే హాల్ టికెట్..!

image

ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఫీజుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీజు మొత్తం కట్టి హాల్ టికెట్ తీసుకెళ్లాలని, లేకపోతే మీరే ఇబ్బంది పడతారని బెదిరిస్తున్నారట. ప్రతిసారి ఇదే జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

News February 18, 2026

ఈసారైనా గందరగోళం లేకుండా సాగుతాయా?

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గత నవంబర్‌లో పీజీ పరీక్షలలో ప్రశ్నాపత్రాల్లో తప్పులు, నిర్వహణలో లోపాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈసారి సెమిస్టర్ పరీక్షలైనా సమర్థవంతంగా నిర్వహిస్తారా? అన్న సందేహం విద్యార్థుల్లో నెలకొంది. అధికారులు ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.