News April 25, 2024

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

image

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కలెక్టర్ హరి చందన దాసరి సూచించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు స్వయంగా రాసి, రికార్డు చేసిన పాటల సీడీని కలెక్టర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ రోజు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో తాగునీరు, ఓఆర్ఎస్ తో పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

Similar News

News September 12, 2025

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నల్గొండ మండలం మేళ్ల దుప్పలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట్ మృతి చెందాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News September 12, 2025

నల్గొండ: ఉద్యోగాలకు సాధనకు 15న ఆమరణ నిరాహార దీక్ష

image

రెండు లక్షల ఉద్యోగాల సాధనకు ఈనెల 15న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను హైదరాబాద్‌లో గురువారం ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి ఆవిష్కరించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరారు.

News September 12, 2025

NLG: ఆర్టీసీలో యాత్రాదానం

image

యాత్రాదానం పేరుతో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్ పథకం కింద కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, NRIలు, సామాజిక బాధ్యతతో వృద్ధులు, దివ్యాంగులకు రవాణా సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థకు విరాళాలు అందిస్తే యాత్రాదాన నిధి కింద ప్రత్యేక ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.