News January 14, 2026
HNK: సెమీస్కు ఒడిశా.. తెలుగు జట్ల నిష్క్రమణ

కాజీపేటలో జరుగుతున్న 58వ సీనియర్ నేషనల్ ఖోఖో పోటీల్లో తెలుగు రాష్ట్రాల జట్ల ప్రస్థానం ముగిసింది. ప్రీ-క్వార్టర్స్లో తెలంగాణ, AP జట్ల మధ్య జరిగిన రసవత్తర పోరులో ఏపీ(28-21) విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో మహారాష్ట్ర చేతిలో ఆంధ్ర జట్టు(16-23) ఓటమి చవిచూసింది. అటు ఒడిశా పురుషుల, మహిళల జట్లు అద్భుత ప్రదర్శనతో సెమీస్కు దూసుకెళ్లాయి. గురువారం సెమీస్, ఫైనల్స్ మ్యాచ్లు నిర్వహించనున్నారు.
Similar News
News March 1, 2026
HYD: పాతబస్తీలో రోబోటిక్ టెక్నాలజీతో డీ-సిల్టింగ్!

పాతబస్తీలోని మురుగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కొత్త రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీ-సిల్టింగ్ పనులను జలమండలి MD అశోక్ రెడ్డి, హైడ్రాకమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవర్ లైన్లలో ఏర్పడిన పూడికను తొలగించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక పద్ధతులతో త్వరగా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు.
News March 1, 2026
TODAY HEADLINES

☛ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం.. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత
☛ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు.. విమాన సర్వీసులు నిలిపివేత
☛ కాకినాడ(D) బాణసంచా పేలుడు ఘటనలో 20 మంది మృతి.. రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన CBN
☛ MAR 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’: రేవంత్
☛ దేశవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ ప్రారంభం
☛ T20 WC నుంచి PAK ఔట్.. సెమీస్కు NZ
News March 1, 2026
HYD: పాతబస్తీలో రోబోటిక్ టెక్నాలజీతో డీ-సిల్టింగ్!

పాతబస్తీలోని మురుగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కొత్త రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీ-సిల్టింగ్ పనులను జలమండలి MD అశోక్ రెడ్డి, హైడ్రాకమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవర్ లైన్లలో ఏర్పడిన పూడికను తొలగించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక పద్ధతులతో త్వరగా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు.


