News January 15, 2026

KNR: సంక్రాంతి, మేడారం ఎఫెక్ట్.. మేకలకు భలే గిరాకీ!

image

సంక్రాంతి, మేడారం జాతర సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేకలు, గొర్రెలకు భారీగా డిమాండ్ పెరిగింది. గురువారం మంథనిలోని ఫ్లైఓవర్ వంతెన సమీపంలో వ్యాపారులు మేకల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వ్యాపారులు అధిక రేట్లు వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. మరోవైపు, ప్రధాన రహదారిపైనే విక్రయాలు జరగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు చెబుతున్నారు.

Similar News

News February 20, 2026

నంద్యాల: గుండెపోటుతో కోవా బన్ను వ్యాపారి మృతి

image

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 20, 2026

నంద్యాల: గుండెపోటుతో కోవా బన్ను వ్యాపారి మృతి

image

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 20, 2026

నల్గొండ: ఫోన్ పేలో లంచాలు.. ఇద్దరిపై వేటు

image

డిజిటల్ చెల్లింపుల ముసుగులో అవినీతికి తెరలేపిన 8 మంది విద్యుత్ అధికారులను TGSPDCL సస్పెండ్ చేసింది. యాదాద్రి సర్కిల్‌లోని భువనగిరి ఆపరేషన్స్ ADE ఆనంద్‌రెడ్డి రూ.5వేలు, చౌటుప్పల్ లైన్‌మెన్ శ్రీనివాస్ రూ.45వేలు లంచం తీసుకున్నారని నిరూపితమైంది. వివిధ పనుల నిమిత్తం వినియోగదారుల నుంచి ఫోన్ పే ద్వారా లంచాలు వసూలు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి బాగోతం బట్టబయలైంది.