News January 15, 2026

ఐనవోలు: మీడియా సెంటర్‌పై నిర్లక్ష్యం..!

image

ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర కవరేజ్ కోసం వచ్చే మీడియా ప్రతినిధులకు అధికారులు మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. కానీ అందులో కుర్చీలు వేయకపోవడంతో ఇతర శాఖలకు చెందిన కార్లు, ద్విచక్రవాహనాలను అందులో పార్కింగ్ చేస్తున్నారు. దీంతో మీడియా ప్రతినిధులకు చోటు లేకుండా పోయింది. ప్రముఖులు దర్శనానికి వచ్చిన సమయంలో మీడియాతో మాట్లాడాలన్నా ఆలయ ఆవరణే దిక్కయింది.

Similar News

News February 19, 2026

ఢిల్లీ AI సమ్మిట్‌లో బిల్ గేట్స్‌ స్పీచ్ రద్దు

image

ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో బిల్‌ ‌గేట్స్ ప్రసంగం రద్దయినట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. వివాదాల దృష్ట్యా సదస్సు ప్రాధాన్యం దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ఫౌండేషన్ ప్రతినిధి అంకుర్ వోరా ప్రసంగించనున్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌’లో బిల్‌ గేట్స్ పేరున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఆయన నుంచి దూరం పాటిస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

News February 19, 2026

శ్రీకాకుళం IIITలో వేధింపులపై విచారణ

image

ఎచ్చెర్లలో ఉన్న శ్రీకాకుళం ఐఐఐటీ క్యాంపస్ సిబ్బంది విద్యార్థులను వేధిస్తున్నట్లు గతంలో వచ్చిన ఫిర్యాదుకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థులను, సిబ్బందిని వేర్వేరుగా విచారణ చేశారు. నూజివీడు క్యాంపస్‌కు చెందిన 6 మంది సభ్యుల కమిటీ విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

News February 19, 2026

ఉమ్మడి NZB జిల్లాలో చికెన్ ధర ఎలా ఉందంటే?

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. కేజీలలో లైవ్ కోడి రూ.150 కాగా విత్ స్కిన్ రూ.200, స్కిన్ లెస్ రూ.220, బోన్ లెస్ రూ.240, చికెన్ లివర్ రూ. 170. మటన్ కేజీ రూ.700 నుంచి 900 వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి. మాంసం ప్రియులు ఇటు చికెన్‌తో పాటు అటు మటన్ కొనుగోలు చేస్తున్నారు.