News January 15, 2026
సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.
Similar News
News March 26, 2026
విశాఖ: ‘మాతృ మరణాలు జరగకుండా చూడాలి’

విశాఖ DMHO కార్యాలయంలో DMHO జగదీశ్వరరావు మాతృ మరణాలపై బుధవారం సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో భవాని గార్డెన్స్ పట్టణ ఆరోగ్యకేంద్రం, పీఎంపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలన్నారు., హైరిస్క్ గర్భిణిలు ప్రసవానికి వచ్చినప్పుడు కేజీహెచ్కి గానీ VGHకి గానీ రిఫర్ చేయాలని ఆయన సూచించారు. మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 26, 2026
విశాఖ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

శ్రీరామనవమి సందర్భంగా విశాఖ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు బుధవారం తెలిపారు. 26వ తేదీ సాయంత్రం విశాఖ నుంచి బయలుదేరి 27న ఉదయం భద్రాచలం చేరుకుంటాయి. శ్రీరామ నవమి రోజున భద్రాచలం దర్శనానంతరం అదేరోజు సాయంత్రం విశాఖకు తిరుగుపయనమవుతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి.
News March 26, 2026
28న విద్యుత్ లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు జీవీఎంసీ పిలుపు

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 28న నిర్వహించే ఎర్త్ అవర్లో విశాఖ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. మార్చి 28న శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని సూచించారు. భవిష్యత్ తరాల కోసం మన భూమిని కాపాడటంలో భాగంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.


