News January 15, 2026

BREAKING: టెర్రస్ వార్‌.. HYDలో చిందిన రక్తం

image

అత్తాపూర్ PS పరిధిలోని పాండురంగనగర్‌బస్తీలో పతంగులు ఎగరేస్తున్న సమయంలో రెండు అపార్ట్‌మెంట్‌ల వాసుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఖాళీ సీసాలను పక్క బిల్డింగ్‌పైకి విసిరారు. కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా గొడవ జరిగింది. కొందరు యువకులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

Similar News

News January 30, 2026

కూపంలోకి కంటోన్మెంట్..? విలీనంపై బీజేపీ నిప్పులు

image

అప్పుల ఊబిలో కూరుకుపోయిన GHMCలో క్రమశిక్షణ గల కంటోన్మెంట్‌ను కలపడమంటే ఆత్మహత్యాసదృశ్యమేనని BJP నాయకులు మండిపడుతున్నారు. “సొంత స్టాఫ్‌కు జీతాలివ్వలేని, ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన GHMCతో మాకేం పని?” అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మేయర్‌ను పప్పెట్‌గా మార్చి కౌన్సిల్ భేటీలే నిర్వహించని అస్తవ్యస్త వ్యవస్థలోకి కంటోన్మెంట్‌ను నెట్టొద్దని BJP నాయకత్వం డిమాండ్ చేస్తోంది. దీనిపై హైదరాబాదీ కామెంట్?

News January 29, 2026

HYD: వీకెండ్‌లో బెస్ట్ డెస్టినేషన్‌.. జింకల పార్కు

image

తెలంగాణ పర్యాటక మణిహారంలో మరో మెరిసే రత్నం చేరబోతోంది. భాగ్యనగరవాసుల వీకెండ్ డెస్టినేషన్ శామీర్‌పేట జింకల పార్కును రూ.1.15 కోట్లతో సర్కారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వందకు పైగా చుక్కల జింకలు, రాజసం ఒలికించే కృష్ణజింకల గంతులతో ఈ అడవి పులకించనుంది. కాంక్రీట్ జంగిల్‌లో అలసిపోయిన మనసులకు ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని అందించే ఈ ప్రాజెక్టు పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తుంది.

News January 29, 2026

HYD: పైకం ఇంకెన్నడు ఇస్తరు?

image

గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు TGHB 3 ప్రాంతాల్లో 111 LIG ఫ్లాట్లకు జనవరి 6న లాటరీ తీశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్షగా నిర్ణయించగా, మొత్తం 2,663 అప్లికేషన్‌లు వచ్చాయి. ఫ్లాట్ రాని వారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. అయితే 22 రోజులు గడిచినా ఇప్పటికీ పైకం రాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తాము చెల్లించిన పైకం రిఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.