News January 15, 2026
తిరుమలలో వరుస సెలవులతో భక్తజనసంద్రం

వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సర్వదర్శనం క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు చేరగా, దర్శనానికి 15 గంటలకుపైగా సమయం పడుతోంది. రూములు దొరక్క కొందరు భక్తులు లాకర్లు, ఆరుబయటే విశ్రాంతి తీసుకుంటున్నారు. కాలినడక మార్గాల్లోనూ భారీ రద్దీ కొనసాగుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు పడుతుండగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
Similar News
News February 20, 2026
మున్సిపల్ ఎన్నికలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: హరీశ్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. క్యాతన్పల్లిలో BRS కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా కౌన్సిలర్పై దాడులు చేసిన తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం విడ్డూరమని ఆక్షేపించారు. క్యాతన్పల్లి ఇన్సిడెంట్ పై గవర్నర్ స్పందించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News February 20, 2026
సర్పంచ్లకు గుడ్ న్యూస్

AP: సర్పంచ్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలో చేసిన తీర్మానాల ప్రకారం నిధులు వాడుకోవచ్చని పేర్కొంది. పనులు చేసిన తర్వాత మెజర్మెంట్స్ బుక్స్లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని వెల్లడించింది.
News February 20, 2026
మార్కాపురం జిల్లా రవాణా శాఖ అధికారిగా టీవీ నాగలక్ష్మి

మార్కాపురం జిల్లా రవాణాశాఖ ఇన్ఛార్జ్ అధికారిగా టీవీ నాగలక్ష్మి గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ… వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైకుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.


