News January 15, 2026
ఇంకా తేలని జగిత్యాల ఎమ్మెల్యే భవితవ్యం..?

గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశం హాట్ టాపిక్గా నడుస్తోంది. అయితే, ఇటీవలే 10 మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునివ్వగ.. తాజాగా శ్రీనివాస్ రెడ్డి, యాదయ్యలు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఫిర్యాదులను తోసిపిచ్చారు. అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఫిరాయింపు విచారణ ఇంకా కొనసాగుతూ ఉండగా.. ఇంకా ఆయన భవితవ్యం తేలాల్సి ఉంది. దీంతో సంజయ్ వర్గంలో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 18, 2026
బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

AP: నెయ్యి వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. అసత్య, నిరాధార ఆరోపణలతో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని అందులో పేర్కొంది. తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా 2014-19లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించారు.
News February 18, 2026
నిజామాబాద్: మాజీ MLC ఆర్.వెంకట్రామిరెడ్డి సతీమణి కన్నుమూత

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ MLC ఆర్.వెంకట్రామ్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకొడప్గల్కు చెందిన ఆయన సతీమణి ఆర్.పుష్పవేణి బుధవారం అనారోగ్యంతో HYDలో కన్నుమూశారు. పుష్పవేణి మృతిపై జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఉమ్మడి నిజామాబాద్ రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.
News February 18, 2026
ఎక్కువ సార్లు డకౌట్ అయింది వీరే

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్లు వీరే:
12- రోహిత్ శర్మ (151 ఇన్నింగ్సులు)
7- విరాట్ కోహ్లీ (117)
7- సంజూ శాంసన్ (50)
6- అభిషేక్ శర్మ (40)
6- సూర్య కుమార్ యాదవ్ (102)
5- అర్ష్దీప్ సింగ్ (28)
5- కేఎల్ రాహుల్ (68)


