News January 16, 2026
కామారెడ్డి జిల్లాలో కొండెక్కిన ధరలు

కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు భగ్గుమంటున్నాయి. సంక్రాంతి ముగింపు వేడుక ‘కనుమ’ సందర్భంగా శుక్రవారం చికెన్కు భారీ డిమాండ్ ఏర్పడింది. కిలో చికెన్ రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతుండగా, లైవ్ కోడి ధర రూ.210 దాటింది. మటన్ కిలో రూ.800కు చేరింది. పండుగ రద్దీతో పాటు కోళ్ల మేత ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్యులకు మాంసం ప్రియమవడంతో బెంబేలెత్తుతున్నారు.
Similar News
News January 25, 2026
ఓటు ప్రజల వజ్రాయుధం: కలెక్టర్

ఎనిమిది పదుల వయసులోనూ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న రామకృష్ణారావు, సత్యనారాయణమూర్తి, కృష్ణంరాజు, శ్రీమన్నారాయణలను ఆదివారం ఏలూరులో కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ ఘనంగా సత్కరించారు. ఓటు ప్రజాస్వామ్య వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
News January 25, 2026
వనపర్తి: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి కలెక్టరేట్ను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సోమవారం ఉదయం 8:30కు కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, 8 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీత రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం 9 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి.
News January 25, 2026
VZM: ఇరువురి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

రామభద్రపురం మండల పరిధి పాతరేగ గ్రామంలో ఇరువురు మధ్య జరిగిన చిన్న గొడవలో ఘర్షణ జరిగి ఒకరినొకరు కొట్టుకోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ ప్రసాదరావు వివరాల మేరకు.. యాసర్ల సింహాచలం (70) అదే గ్రామానికి చెందిన పెద్దింటి తిరుపతికి మధ్య పాతబాకీ డబ్బులు కోసం శనివారం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో తిరుపతి, సింహాచలాన్ని బలంగా తోసాడు.. అతడు కొళాయి దిమ్మపై పడడంతో మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.


