News April 25, 2024
భీమిలిలో గంటా శ్రీనివాస్ పేరిట మరో అభ్యర్థి నామినేషన్

భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస రావు పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే పేరుతో మరో వ్యక్తి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గురువారం భీమిలి ఆర్డీవో కార్యాలయంలో జాతీయ జనసేన పార్టీ తరఫున గంటా శ్రీనివాస రావు అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. మరి పోటీలో ఉంటారా నామినేషన్ ఉపసంహరించుకుంటారో వేచి చూడాలి.
Similar News
News October 13, 2025
ఆక్రమణకు గురౌతున్న ఏయూ భూములు..!

నగరంపాలెంలోని ఏయూ 137 ఎకరాల భూమిని ఏయూ వీసీ జి.పి రాజశేఖర్, రిజిస్ట్రార్ రాంబాబు సోమవారం పరిశీలించారు. కొంత భూమి ఆక్రమణలకు గురిఅవుతోందని, మరికొంత స్థలంలో అనధికార రహదారి నిర్మాణం జరుగుతుండటాన్ని గుర్తించారు. ఏయూ భూముల సరిహద్దులను త్వరగా నిర్ధారించాలన్నారు. భూమిని పరిరక్షించే విధంగా అవసరమైన చర్యలను సత్వరం చేపట్టాలని వీసీ అధికారులకు ఆదేశించారు.
News October 13, 2025
ఏయూలో ఆకస్మిక తనిఖీ చేసీన వీసీ

ఏయూలో పలు విభాగాలను వైస్ ఛాన్సెలర్ రాజశేఖర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పనివేళల్లో సిబ్బంది తప్పనిసరిగా విధుల్లో ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అనంతరం ఏయూ డిస్పెన్సరీని సందర్శించారు.ప్రతీ విద్యార్థికి అవసరమైన వైద్యసేవలను సత్వరం, సకాలంలో అందించాలని సూచించారు.
News October 13, 2025
జీవీఎంసీలో పీజీఆర్ఎస్కు 100 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 100 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ అదనపు కమిషనరు డి.వి.రమణమూర్తి తీసుకున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్ విభాగమునకు 4, రెవెన్యూ 5, ప్రజారోగ్యం 6, పట్టణ ప్రణాళిక 58, ఇంజినీరింగు 22, మొక్కల విభాగం 1, యుసిడి 04 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.