News January 17, 2026
మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు

AP: సంక్రాంతి పండుగను కుటుంబంతో ఆనందంగా గడిపిన ప్రజలు మధుర జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని పల్లెలకు వీడ్కోలు పలుకుతున్నారు. ఉద్యోగాలు, చదువుల కోసం తిరిగి నగరాల బాట పట్టడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా RTC ప్రత్యేక బస్సులు, SCR ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
Similar News
News February 14, 2026
శివరాత్రి మరునాడు ఆప్షనల్ హాలిడే

AP: మహాశివరాత్రి పర్వదినం ఈ నెల 15(ఆదివారం) నాడు ఉంది. ఆ మరునాడు అంటే సోమవారం ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలనా శాఖ ఇవాళ జీవో విడుదల చేసింది. శివరాత్రి భక్తులు జాగారం చేయనున్నందున మరునాడు సెలవు తీసుకొనేలా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
News February 14, 2026
గతేడాది మాదిరే ఉంది.. బడ్జెట్పై బుగ్గన విమర్శలు

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. ‘బడ్జెట్ స్పీచ్లో అసత్యాలు చెప్పారు. సూపర్-6 అంటూ అధికారంలోకి వచ్చి వాటికి కేటాయింపులు లేవు. బడ్జెట్లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది బడ్జెట్ బుక్ చూసినట్లే ఉంది. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పలేదు. ఏయే రంగాలకు ఎంత కేటాయించారో వెల్లడించలేదు’ అని వ్యాఖ్యానించారు.
News February 14, 2026
ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఏసీబీ ఆయనను విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసు కోసం విదేశీ సంస్థకు అక్రమంగా డబ్బులు చెల్లించారని ఏసీబీ కేసు నమోదు చేసింది.


