News April 25, 2024

శ్రీకాకుళంలో నామినేషన్ల వివరాలు

image

శ్రీకాకుళం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు, పార్టీలకు చెందిన అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.1.కాయ దుర్గారావు, 2.బేత వివేకానంద మహరాజ్, 3.BYC పార్టీ నుంచి బోరుభద్ర చంద్రకళ, 4.శ్రవణ్ కుమార్, 5.PPI పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా కారి లక్ష్మణ్ గురువారం ఉదయం నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Similar News

News September 12, 2025

SKLM: రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

image

రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు ఫోన్ చేసి తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. రైతుల వివిధ రకాల సమస్యలను తెలుసుకుని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు రైతులకు కాన్ఫరెన్స్ ఫోన్ కాల్‌కి తీసుకొని ఎరువులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

News September 11, 2025

నేపాల్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న సిక్కోలు వాసులు

image

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.

News September 11, 2025

ఎల్.ఎన్.పేట: పాముకాటుతో వ్యక్తి మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.