News April 26, 2024
పల్నాడు: జిల్లాలో ఏడో రోజు 89 నామినేషన్లు

జిల్లాలో ఏడవ రోజు గురువారం మొత్తం 89 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్కు 11, నరసరావుపేట అసెంబ్లీకి 14, పెదకూరపాడు అసెంబ్లీకి 10, చిలకలూరిపేట అసెంబ్లీకి11 సత్తెనపల్లి అసెంబ్లీకి 9, వినుకొండ అసెంబ్లీకి 12, గురజాల అసెంబ్లీకి 13, మాచర్ల అసెంబ్లీకి 9 నామినేషన్లు దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 25, 2026
గుంటూరులో రిపబ్లిక్ డే వేడుకలు రేపు 11:30కి ప్రారంభం: కలెక్టర్

పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో సోమవారం జరగనున్న జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం పరిశీలించారు. రేపు 11:30కి రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రస్థాయి వేడుకలకు హాజరు కావాల్సి ఉన్నందున జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో మార్పులు చేయడం జరిగిందని తెలిపారు. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News January 25, 2026
గుంటూరు జిల్లా ప్రజలకి గమనిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ నిర్వహణను సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రద్దు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిమగ్నమై ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే PGRS, రెవెన్యూ క్లీనిక్ని రద్దు చేశామని అన్నారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించి కలెక్టరేట్కి వచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు.
News January 25, 2026
PGRSరద్దు.. కానీ ఫోన్ చెయ్యొచ్చు: GNT కమిషనర్

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నగర ప్రజలు విషయాన్ని గమనించి ఏదైనా సమస్యలు ఉంటే 0863 2345103కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.


