News January 17, 2026

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు యువతి

image

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్‌లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్‌బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.

Similar News

News January 29, 2026

డీసీసీబీ సేవలపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో గురువారం కేడీసీసీ బ్యాంక్ జిల్లా స్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రైతులకు అందుతున్న రుణాలు, పథకాల అమలు, రికవరీ స్థితిగతులపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు సకాలంలో అందేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. బ్యాంక్ సేవల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News January 29, 2026

కర్నూలు కలెక్టరేట్ నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీ

image

హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి ఆమె అవగాహన ర్యాలీని ప్రారంభించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజ్ విహార్ సెంటర్ వరకు కొనసాగి ముగిసింది. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.

News January 28, 2026

రెండో రోజు కొనసాగిన ఇంటర్ ప్రాక్టికల్స్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2వ రోజు ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి. పరీక్షల వివరాలను బుధవారం ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 1,313 మందికి గాను 1,239 మంది హాజరవ్వగా.. 74 మంది గైర్హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1,081 మందికి గాను 1,064 మంది పరీక్ష రాశారని, 17 మంది హాజరు కాలేదని పేర్కొన్నారు.