News January 17, 2026
నేడు సిక్కోలు రచయిత చాసో జయంతి

సిక్కోలు గడ్డపై జన్మించిన ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) జయంతి నేడు. 1915 జనవరి 17న శ్రీకాకుళంలో జన్మించిన ఆయన, సామాన్యుల జీవితాలను తన కలంతో అద్భుతంగా ఆవిష్కరించారు. 1942లో ‘చిన్నాజీ’ కథతో ప్రయాణం మొదలుపెట్టి, ఐదు దశాబ్దాల కాలంలో 46కు పైగా ఆణిముత్యాల్లాంటి కథలను తెలుగు సాహిత్యానికి అందించారు. వాడుక భాషా కథలకు ప్రాణం పోసిన ఆయన రచనలు నేటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. 1994 జనవరి 1న మరణించారు.
Similar News
News February 2, 2026
రేపటి నుంచి జరగబోయే సెమిస్టర్ పరీక్షలు వాయిదా

B.P.Ed & D.P.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈమేరకు ఆయన సోమవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
News February 2, 2026
శ్రీకాకుళం: ప్రియురాలి అలక.. రైలు పట్టాలపై తలపెట్టిన యువకుడు

ప్రేయసి అలిగిందని రైలు పట్టాలపై ఓ యువకుడు తలపెట్టిన ఘటన టెక్కలిలో ఆదివారం జరిగింది.పార్వతీపురానికి చెందిని యువతి, మెలియాపుట్టి ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమలో ఉన్నారు.యువతిని కలవాలనుకున్న అతడు తనకు ప్రమాదం జరిగిందని చెప్పి టెక్కలికి రప్పించాడు.అది అబద్ధమని తెలుసుకున్న ఆమె అలిగి వెళ్లిపోతుండగా పట్టాలపై తలపెట్టాడు.స్థానికులు అప్రమత్తమై అతడిని కాపాడారు. అనంతరం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
News February 2, 2026
జిల్లాలో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.


