News January 18, 2026

అనంతపురం: 19న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

అనంతపురం జిల్లా ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

Similar News

News March 7, 2026

అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో వడ్డించే అల్పాహారం నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని సిబ్బందికి సూచించారు. అక్కడ అందుతున్న సేవలపై నేరుగా ప్రజలను అడిగి ఆరా తీశారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 7, 2026

సమన్వయంతో విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ, మెప్మా సంబంధిత శాఖల సమన్వయంతో ప్రతీ సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు.

News March 6, 2026

నిధులు విడుదల చేయండి: మంత్రి, ఎమ్మెల్యేలు

image

అనంతపురంలోని నడిమి వంక, మరువ వంక ప్రొటెక్షన్ వాల్స్ కోసం రూ.79.46 కోట్ల కేటాయించాలని సీఎం చంద్రబాబుకు MLA దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలాగే మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.18.84 కోట్ల విడుదల చేయాలని కోరారు. శిల్పారామంలో మౌళిక వసతుల కల్పన కోసం రూ.9.95 కోట్లు కేటాయించాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని MLA తెలిపారు.