News January 18, 2026
రథసప్తమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు: ఐజీ

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ, డీఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ మరియు రూట్ మ్యాప్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News March 13, 2026
SKLM: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి పరీక్షలకు ఉచిత శిక్షణ

రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్ డి – 2026 పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా BC సంక్షేమ అధికారి ఎపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ. అనూరాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను మార్చి 23వ తేదీలోగా ఎ.సి.బి.సి.స్టడీ సర్కిల్, శ్రీకాకుళంకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. 100 మంది అభ్యర్ధులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.
News March 13, 2026
SKLM: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి పరీక్షలకు ఉచిత శిక్షణ

రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్ డి – 2026 పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా BC సంక్షేమ అధికారి ఎపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ. అనూరాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను మార్చి 23వ తేదీలోగా ఎ.సి.బి.సి.స్టడీ సర్కిల్, శ్రీకాకుళంకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. 100 మంది అభ్యర్ధులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.
News March 12, 2026
శ్రీకాకుళం: 24 మంది గ్రేడ్-2 వీఆర్వోలకు గ్రేడ్-1 పదోన్నతి

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న 24 మంది గ్రేడ్ వీఆర్వోలకు గ్రేడ్ వన్ వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలను కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యకు పరిష్కార మార్గం చూపిన కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్లకు వీఆర్వోల సంఘ ప్రతినిధులు రాజేష్, అప్పలనాయుడు, రాంజీ ఇతర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.


