News January 18, 2026

కామారెడ్డి: మున్సిపల్ టికెట్ల రేసులో ‘యువ’ గళం!

image

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఆసక్తికరంగా మారింది. సీనియారిటీ కంటే యువత, విద్యావంతుల వైపే రాజకీయ పార్టీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటడం, రిజర్వేషన్లతో మహిళల వాటా పెరగడంతో ఈసారి మున్సిపల్ పగ్గాలు కొత్త తరం చేతికి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Similar News

News February 12, 2026

VZM: తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు

image

శివ‌రాత్రికి రామ‌తీర్థం, పుణ్య‌గిరి, ధ‌ర్మ‌వ‌రం, సంగ‌మేశ్వ‌ర స్వామి ఆల‌యం, పాల్తేరు, కోటిప‌ల్లి, త‌దిత‌ర శివాల‌యాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఉచిత‌ బ‌స్సు ప‌థ‌కం వ‌ల్ల‌ మ‌హిళ‌లు గ‌తం కంటే ఎక్కువగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ప్ర‌వేట్ ఆల‌యాలకు సంబంధించి ఆల‌య క‌మిటీల‌ను అప్ర‌మ‌త్తం చేయాలన్నారు.

News February 12, 2026

ఆదిలాబాద్: బ్యాలెట్ బాక్స్‌లోనే భవితవ్యం

image

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకోగా, అభ్యర్థుల్లో మాత్రం ఉత్కంఠ పెరిగింది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా, ఓటింగ్ సరళిపై స్పష్టమైన అంచనాకు రాలేక లోలోన ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులపైనే ఉంది.

News February 12, 2026

టెన్త్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లు!

image

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ పలు మార్పులు చేసింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇన్విజిలేషన్ చేస్తుండగా, ఇకపై ప్రైవేటు టీచర్లకూ అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది నుంచి 25% మంది ప్రైవేటు టీచర్లను తీసుకోనుంది. ఆన్‌లైన్ విధానంలో ఇన్విజిలేషన్ బాధ్యతలు కేటాయించనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 4 నుంచి 10 రోజులు జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది.