News January 18, 2026
సమ్మక్క తల్లి చిలుకలుగుట్ట వద్ద OLD PHOTO

మహా కుంభమేళ మేడారం జాతరలో కోటిమంది భక్తుల ఎదురుచూపు సమ్మక్క తల్లి కోసమే. పూర్వీకుల నుంచి చిలుకలగుట్ట వద్దకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుని సమ్మక్క రాకకై ఎదురుచూస్తుంటారు. గుట్ట దిగెటప్పుడు కనులారా చూసేందుకు అక్కడే ఉన్న చెట్లపై ఎక్కి సమ్మక్క దర్శనం చేసుకుని తరించిపోతారు. పూర్వం సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటప్పుడు పోలీసులు రోప్ పార్టీ ఏర్పాటు చేసి తీసుకెళ్తున్న దృశ్యం.
Similar News
News February 20, 2026
ట్రోలిన్ పేలి.. గట్టుసింగారం వాసి మృతి

యాదాద్రి (D) భూదాన్ పోచంపల్లి ధోతిగూడెం శివారులోని ఓ కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కూసుమంచి గట్టుసింగారానికి చెందిన ధార పవన్ మృతి చెందారు. భోజన విరామ సమయంలో కార్మికులంతా బయటకు వెళ్లగా, విధుల్లో ఉన్న పవన్ వద్ద ట్రోలిన్ పేలింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు సీనియర్ కెమిస్ట్రీ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 20, 2026
కాళ్ల: పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీ

పదో తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ నారాయణ అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు, జువ్వలపాలెం హైస్కూల్ లను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గత ఏడాది ఈరెండు పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణశాతం 36 సాదించారని, రాబోయే మార్చి 16 నుంచి జరుగనున్న పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు
News February 20, 2026
ట్రంప్కు BIG SHOCK

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయా దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లను కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి టారిఫ్ల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం చట్టవిరుద్ధమని తెలిపింది. సుప్రీం తీర్పుతో US మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.


