News April 26, 2024
భీమిలిలో అత్యధిక ఓటర్లు.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

భీమిలి నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 3,60,507 మంది ఓటర్లతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వీరిలో పురుషులు 1,76,860, స్త్రీలు 1,83,632,ఇతరులు 15 మంది కలరు. విస్తీర్ణంలోని పెద్దదిగా గుర్తింపు పొందింది. భీమిలితో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలు, ముఖ్యంగా మధురవాడ నియోజకవర్గంలో కలవు. ప్రముఖ సందర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
Similar News
News October 13, 2025
సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహారం కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.
News October 13, 2025
ఆక్రమణకు గురౌతున్న ఏయూ భూములు..!

నగరంపాలెంలోని ఏయూ 137 ఎకరాల భూమిని ఏయూ వీసీ జి.పి రాజశేఖర్, రిజిస్ట్రార్ రాంబాబు సోమవారం పరిశీలించారు. కొంత భూమి ఆక్రమణలకు గురిఅవుతోందని, మరికొంత స్థలంలో అనధికార రహదారి నిర్మాణం జరుగుతుండటాన్ని గుర్తించారు. ఏయూ భూముల సరిహద్దులను త్వరగా నిర్ధారించాలన్నారు. భూమిని పరిరక్షించే విధంగా అవసరమైన చర్యలను సత్వరం చేపట్టాలని వీసీ అధికారులకు ఆదేశించారు.
News October 13, 2025
ఏయూలో ఆకస్మిక తనిఖీ చేసీన వీసీ

ఏయూలో పలు విభాగాలను వైస్ ఛాన్సెలర్ రాజశేఖర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పనివేళల్లో సిబ్బంది తప్పనిసరిగా విధుల్లో ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అనంతరం ఏయూ డిస్పెన్సరీని సందర్శించారు.ప్రతీ విద్యార్థికి అవసరమైన వైద్యసేవలను సత్వరం, సకాలంలో అందించాలని సూచించారు.