News January 18, 2026

గ్రేటర్ HYDలో 20న ఆటోల బంద్!

image

నగర వ్యాప్తంగా జనవరి 20న ఆటోల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ మహమ్మద్ తెలిపారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్లతో భారీ ధర్నా చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వమే స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు.

Similar News

News April 6, 2026

పుష్కర ఘాట్‌లో స్నానాలకు ఏర్పాట్లు చేయాలి: శైలజా రామయ్యర్

image

మే మొదటి వారంలోగా నది ఘాట్ వద్ద క్లాడింగ్, రైలింగ్ పనులు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత కోసం బారికేడ్లు, హెలిప్యాడ్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నదిలో పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు.

News April 6, 2026

లేబర్ వెల్ఫేర్ పథకాల ప్రచారానికి కమిటీలు

image

AP: నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ-టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు టెండర్ ఈవాల్యుయేషన్, అప్రూవల్ కమిటీలను నియమిస్తూ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ-శ్రామ్ నమోదు, బాండెడ్ లేబర్ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది.

News April 6, 2026

లేబర్ వెల్ఫేర్ పథకాల ప్రచారానికి కమిటీలు

image

AP: నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ-టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు టెండర్ ఈవాల్యుయేషన్, అప్రూవల్ కమిటీలను నియమిస్తూ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ-శ్రామ్ నమోదు, బాండెడ్ లేబర్ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది.