News January 18, 2026

4 రోజుల్లో ₹14,266 కోట్లు ఔట్

image

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) గతవారం ఏకంగా ₹14,266 కోట్లు వెనక్కి తీసుకున్నారు. కేవలం 4 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ భారీ అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సుంకాల భయాల నేపథ్యంలో విదేశీ సంస్థలు తమ పెట్టుబడులను విత్‌డ్రా చేసుకుంటున్నాయి. అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs) ₹16,174 కోట్లు పంప్ చేయడంతో మార్కెట్లు స్థిరంగా నిలబడగలిగాయి.

Similar News

News February 6, 2026

క్లాడ్ 4.6 ఓపస్: పనులన్నీ చిటికెలో.. IT ఉద్యోగుల ఆందోళన ఇదే..

image

ఆంథ్రోపిక్ కొత్తగా రిలీజ్‌ చేసిన Claude Opus 4.6 మోడల్ ప్రొఫెషనల్ పనుల కోసం డిజైన్ చేశారు. ఇది కాంప్లెక్స్ కోడింగ్‌ను సెకన్లలో డీబగ్ చేస్తుంది. భారీ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. వేల పేజీల డాక్యుమెంట్లను సెకన్లలో రీసెర్చ్ చేస్తుంది. ఫైనాన్షియల్ అనాలసిస్, ఎక్సెల్ షీట్లు, ప్రజెంటేషన్లను తయారు చేయడంలో ఇది దిట్ట. దీని రాకతో IT రంగంలో జాబ్స్ పోతాయంటూ <<19066930>>ఆందోళన<<>> వ్యక్తమవుతోంది.

News February 6, 2026

గుడిలో తలమీద శఠగోపం ఎందుకు పెడతారు?

image

ఆలయంలో దర్శనం తర్వాత తలపై శఠగోపం పెడతారు. ఆ సమయంలో మనసులో కోర్కెను కోరాలని పండితులు సూచిస్తున్నారు. పూజారికి కూడా వినిపించనంత మెల్లగా మనసులో తలుచుకోవాలని చెబుతారు. ఎందుకంటే.. ఇది మానవునికి శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు దూరంగా ఉంటామని దేవుని ముందు తలవంచి అంగీకరించడం. ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరడమే కాకుండా, మనసులోని దుర్గుణాలు తొలగి ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.

News February 6, 2026

సైబర్ బాధితులకు రూ.25వేల వరకు కాంపెన్సేషన్..RBI ప్రపోజల్స్

image

చిన్న మొత్తాల డిజిటల్, సైబర్ ఫ్రాడ్స్, బలవంతంగా లోన్ రికవరీతో మోసపోయిన బాధితులకు పరిహారం చెల్లించే ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్టు RBI ప్రకటించింది. నష్టపోయిన దాంట్లో 85%/రూ.25వేల వరకు నగదు రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని చెల్లించేలా ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేస్తోంది. OTP చెప్పడం ద్వారా నగదు కోల్పోయిన బాధితులు కూడా జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే కాంపెన్సేషన్ పొందే అవకాశాన్ని కల్పించనుంది.