News January 18, 2026
బధిరుల క్రీడల్లో ‘పశ్చిమ’ ప్రభంజనం.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

హర్యానాలో జరిగిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడా పోటీల్లో ప.గో. జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించారని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి 600 మంది పాల్గొన్న ఈపోటీల్లో, జిల్లా నుంచి వెళ్లిన 16 మంది ప్రతిభ కనబరిచారన్నారు. విజేతలను ఆదివారం భీమవరంలో ఘనంగా అభినందించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణించడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
Similar News
News February 6, 2026
ప.గో: వరి రైతులకు ‘ఎలుక గండం’

ప.గో. జిల్లాలో రబీ సాగు చేస్తున్న రైతులు ఎలుకల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2.25 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిన రెండో వారం నుంచే తెగుళ్లు, ఎలుకలు పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి నిర్మూలనకు హెక్టారుకు రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అధికారులు సామూహిక చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదని సాగుదారులు ఆరోపిస్తున్నారు.
News February 6, 2026
ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.
News February 6, 2026
ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.


