News January 18, 2026
అరటి పండ్ల విషయంలో గొడవ.. హిందూ వ్యాపారిని కొట్టిచంపారు!

బంగ్లాదేశ్లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. ‘ఘాజీపూర్లో లిటన్ చంద్ర ఘోష్ (55) హోటల్ నిర్వహిస్తున్నాడు. మాసుమ్ మియాకు అరటి తోట ఉంది. ఈ క్రమంలో తమ అరటి పండ్లను ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. లిటన్ హోటల్ వద్ద అవి కనిపించడంతో మాసుమ్, అతడి తల్లిదండ్రులు స్వాపన్, మాజేదా వాగ్వాదానికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో లిటన్ చనిపోయాడు. ముగ్గురినీ అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు.
Similar News
News February 23, 2026
పాక్ వైమానిక దాడులపై భారత్ ఫైర్

అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
News February 23, 2026
ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉంటే?

ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉండటం చాలా మంచిదని పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. ‘దానివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీనిని లివింగ్ రూమ్లో ఉంచితే కుటుంబసభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాలు బలపడతాయి. నెమలి అందం ఇంటికి ఆకర్షణీయ రూపాన్నిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగించి, ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతిమంగా సానుకూల మార్పులకు దారి తీస్తుంది’ అంటున్నారు.
News February 23, 2026
అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదం: ఫిబ్రవరి 28 నాటికి రిపోర్ట్!

అజిత్ పవార్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఈ నెల 28 లోపు విడుదల కానున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లోపు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండటంతో శనివారానికల్లా వాస్తవాలు బయటకు రానున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ ఆరోపణలు చేయడంతో ఈ రిపోర్ట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


