News January 18, 2026
చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

సర్వ శిక్ష అభియాన్లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.
Similar News
News March 18, 2026
చిత్తూరు ZP విభజనకు కసరత్తు.!

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ను ఎన్నికల నాటికి మూడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరులో జడ్పీ పదవీకాలం ముగియనుండటంతో, ఆలోపు విభజించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పడనున్నాయి. దీంతో పరిపాలనా సౌలభ్యం మెరుగు పడనుంది.
News March 18, 2026
లక్ష్యం రూ.56 కోట్లు.. ఇంకా రూ.26 కోట్ల బకాయిలు

పట్టణాల్లో ఆస్తి, నీటి పన్ను లక్ష్యాలను చేరుకునేందుకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఉంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ. 30 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం బకాయిలపై 50% వడ్డీ రాయితీ ప్రకటించిన నేపథ్యంలో 100% లక్ష్యాలు చేరుకుంటారేమో చూడాల్సి ఉంది.
News March 18, 2026
నేటి నుంచి చిత్తూరు జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన

మున్సిపాలిటీ పాలకవర్గానికి గడువు ముగియడంతో బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి మున్సిపాలిటీలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. పరిపాలనాపరమైన నిర్ణయాలను ఇక వారే తీసుకోనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో మాత్రం ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో సెప్టెంబర్ వరకు పాలకవర్గానికి గడువు ఉంది.


