News January 18, 2026

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. ఏడుగురు సైనికులకు గాయాలు

image

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పాయి. ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.

Similar News

News February 4, 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం

image

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో ఆయన BJP అభ్యర్థుల విజయానికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నట్లు జనసేన వర్గాలు స్పష్టం చేశాయి.

News February 4, 2026

నామినేషన్ల పర్వం సమాప్తం.. నేటి నుంచి హోరెత్తనున్న ప్రచారం!

image

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి, అభ్యర్థులపై స్పష్టత రావడంతో నేటి నుంచి ప్రచారం హోరెత్తనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. FEB 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో పాటు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగనుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

News February 4, 2026

ట్రేడ్ డీల్ ఖరారు.. అమెరికాలో జైశంకర్ బిజీ

image

IND-US ట్రేడ్ డీల్ ఖరారవడంతో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ రంగంలోకి దిగారు. వాషింగ్టన్‌లో US సెక్రటరీ రూబియో, ట్రెజరీ సెక్రటరీ బెసెంట్‌లతో భేటీ అయ్యారు. క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్‌తో సహకారంపై చర్చించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇంధన భద్రత, కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.